ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 26, 2021, 02:58 PM

వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన తెనాలి ట్రాఫిక్ ఎస్ఐ జోగి శ్రీనివాస్ అన్నారు. తెనాలి డిఎస్పీ ఆదేశానుసారము ఆదివారం ఉదయం వైకుంఠపురం వద్ద రహదారి పై వాహన చోదకుల కు అవగాహహన కల్పిస్తూ నిత్యం వాహన రద్దీతో ఉండే వైకుంఠ పురం వద్ద చోదకుల ను ఆపి రోడ్డు ప్రమాదాలు జరుగు తున్న తీరు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, వాహన చోదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్యం, అలసత్వం, మానవ తప్పిదాలు గురించి వాహన చోదకులకు అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా ప్రజల రక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని తెనాలి ట్రాఫిక్ ఎస్ఐ జోగి శ్రీనివాస్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతి వేగంగా వాహనాలు నడపరాదని, స్పీడ్ తో వెళ్లరాదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రామాణిక కలిగిన హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రస్తుత కోవిడ్ ఉథృతి దృష్ట్యా మాస్క్ తప్పని సరిగా ముక్కుకు మూతికి బిగుతుగా కట్థుకోవాలని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa