ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' మన తలుపులు తట్టిందని మనం గుర్తుంచుకోవాలని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారిని ఓడించడానికి పౌరులుగా మన ప్రయత్నం చాలా ముఖ్యం అని 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ అన్నారు. 'ప్రతి ఏడాది నేను 'పరీక్షా పర్ చర్చ'లో విద్యార్థులతో వివిధ విషయాలను చర్చిస్తాను. ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు చర్చలు చేస్తాను. ఇందులో భాగంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు కూడా నిర్వహించనున్నాం' అని ప్రధాని తెలిపారు.
కెప్టెన్ వరుణ్ సింగ్ తమిళనాడులో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో గాయపడ్డారు. ఆయన చాలా రోజులు ధైర్యంగా మృత్యువుతో పోరాడాడు. కానీ అతను కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అని ప్రధాని అన్నారు. 'ఆ ప్రమాదంలో దేశ మొదటి సి.డి.ఎస్. జనరల్ బిపిన్ రావత్, వారి ధర్మపత్ని సమేతంగా ఎందరో వీరులను మనం పొగొట్టుకున్నాము. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నా మనసుకు హత్తుకునే విషయం చూశాను. ఈ ఏడాది ఆగస్టులో అతనికి శౌర్య చక్ర అవార్డు లభించింది. ఈ అవార్డు తర్వాత అతను తన పాఠశాల ప్రిన్సిపాల్కి లేఖ రాశాడు. ఆ లేఖ చదివిన తర్వాత, నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే అతను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మరచిపోలేదు' అని ప్రధాని మోదీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa