ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యులు నిర్భయంగా స్టేషన్ కు వెళ్తున్నారు-డీజీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 06:59 PM

సామన్య వ్యక్తులు కూడ పోలీస్ దగ్గరకు వెళ్ళేందుకు అవకాశం కలిగిందని, గతంలో ఇటు వంటి పరిస్థితి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఇన్వేస్టీగేషన్ చేసి ఛార్జీషీట దాఖాలు చేయడంలో గత ఐదు సంవత్సరాల కాలంలో 75.09 % మెరుగైందని ఆయన వెల్లడించారు.  ఇంకా ఆయన మాట్లాడుతూ...సిఎడబ్లు 42 % మెరుగైంది.దిశ చట్టం కొచ్చినప్పుడు అక్కువ కాలలో ఇన్వేస్టీగేషన్ జరుగుతుందా అనే అనుమానాలను పటాపంచలు చేసి త్వరతగతిన ఇన్వేస్టీగేషన్ చేసి కేసులు నమోదు చేస్తున్నామనన్నారు.దిశ కోటి డౌన్ లోడ్ లు చేయలన్నారు కాని 97 లక్షల పై చిలుకు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు.  దిశ యాప్ త్వరగానే రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే అన్నారు.  స్పందనలో భాగంగా 163 033 పీటిషన్స్ వస్తే 40,404 ఎఫ్ ఐఆర్ నమోదు చేశామన్నారు.


మిగితావి కూడ విచారణజరిపి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.గతంలో లాగ కాక పోలిస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లేంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మైనర్ లు కూడ కంప్లేంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ పరివర్తనలో  భాంగంగా ఏజెన్సీ ఏరియాలో 2,762 ఎకరాల గంజాయి సాగుల్నీ ద్వంసం చేశామన్నారు.


ఎక్సైజ్ కేసుల్లో 43,293 కేసుల్లో 60,868 మందిని అరెస్ట్ చేశి 20 ,945 వాహనాలను స్వాధినం చేసుకున్నామని తెలిపారు.  టెక్నాలజీ ద్వార నేర పరిశోదన కొత్త పుంతలు తోక్కుతుందని అన్నారు.దాని ద్వార మొబైల్ అప్లికేషన్ సెంట్రల్ లాక్,ఇన్వేస్టీగేషన్ ట్రాక్కర్ జిఐయస్,జిపియస్ విధానం పద్దతులు  డిజిటల్ విధానం అనుసరిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ ని ఉపయోగించడంలో ఆంధ్రప్రదేశ్ ముందజలో ఉందన్నారు.యస్సి,యస్టీ,మహీళలకు కాంపన్సేషన్ ఇవ్వడంలో  ఖచ్చితత్వం పాటిస్తున్నామని తెలిపారు.  డిఎన్ఎ రిపోర్ట్ ఇవ్వడంలో ప్రంపంచ స్థాయిలో ఉందన్నారు.48 గంటల్లో తిరుపతి,విశాఖపట్నం,విజయవాడలో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఏవిడెన్స్ బేస్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa