ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 05:40 PM

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రామతీర్థం ఘటనలో తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయ ధర్మకర్త అశోక్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa