బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్లో పాల్గొనబోమని అధికారికంగా ప్రకటించింది.ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడటంతో, భద్రతా కారణాలను చూపుతూ ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడటం సాధ్యం కాదని బీసీబీ స్పష్టం చేసింది. తమ మ్యాచ్లను ఇండియా బయట తటస్థ వేదికలకు తరలించాలని ఐసీసీని కోరింది.అలాగే, తమ జట్టును గ్రూప్-సీ నుంచి గ్రూప్-బీకి మార్చాలనే ప్రతిపాదనను కూడా బంగ్లాదేశ్ ముందుంచింది. అయితే, ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఖరారవడంతో బీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలోనే మ్యాచ్లు ఆడాల్సిందిగా సూచిస్తూ, లేనిపక్షంలో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది.ఈ నేపథ్యంలో, ఇండియాలో ఆడేందుకు ఇష్టపడని బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం (జనవరి 22) ప్రకటించింది.దీంతో మెగా టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందా? లేదా? అనే సందిగ్ధతకు తెరపడింది. బంగ్లా తప్పుకోవడంతో, ఆ జట్టు స్థానంలో మరో జట్టును ఐసీసీ భర్తీ చేయనుంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లలో సాధించిన పాయింట్ల ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
-ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్లు : భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ ఇండియాలో మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో మూడు కోల్కతాలో, ఒకటి ముంబైలో జరగాల్సి ఉంది.ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో కోల్కతాలో మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, ఈ మ్యాచ్లపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa