రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా పేర్కొన్న కేంద్రం.. స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో వివాదాస్పదంగా మారిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఫ్ఎస్పీఏ) అమలును కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు నెలలపాటు పొడిగించింది. రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా పేర్కొన్న కేంద్రం.. స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ చట్టం అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ డిసెంబర్ 21న ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు కూడా చట్టం రద్దుకు డిమాండ్ చేశాయి. అయితే, ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొంది. తాజాగా చట్టాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ చట్టం అమలులో ఉండనుంది. కాగా, రాష్ట్రంలో ఈ చట్టం ఉపసంహరణ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 4న ఇక్కడి మోన్ జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల ఘటనలో 14 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన క్రమంలో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నాగాలాండ్ ప్రభుత్వంతోపాటు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాయి. ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa