అనంతపురం: ప్రాణాంతకమైన కరోనా, ఒమిక్రాన్ వైరస్ ను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప ఆదేశాలతో ప్రజల ప్రాణాలను పరిరక్షించేందుకు నూతన సంవతసర వేడుకలు బహిరంగ ప్రదేశాల్లో చేపట్టకూడదని ఆంక్షలు విధించినట్లు సిఐ సురేష్ బాబు తెలిపారు. రాయదుర్గం యూపీఎస్ పోలీసు స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 31 జనవరి 1 న ఎటువంటి వేడుకలకు అనుమతి లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్లుబడితే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సైలెన్సర్ లు తీసి వాహనాలు నడపరాదని తెలిపారు. 30 యాక్ట్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇళ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరపుకుని పోలీసు వారితో సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa