ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లా కరోనా అప్ డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:40 PM

విశాఖ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 31 కరోనా కేసులు నమోదయినట్టు జిల్లా వైద్య అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం తో పోలిస్తే శుక్రవారం ఒక్క కేసు ఎక్కువ నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 158917 కు చేరుకుంది. జిల్లాలో 156 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 157622 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1139 మంది కరోనా బారినపడి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.


జిల్లాలో కరోనా రెండో దశ మొదటి దశకు పూర్తి భిన్నంగా ఉంది. గత సంవత్సరం మొదటి దశలో కేసులు క్రమంగా తగ్గుకుంటూ వచ్చాయి. కానీ ఈసారి రెండోదశలో కేసులు ఒకరోజు తగ్గుతున్నాయి. మరో రోజు పెరుగుతున్నాయి. అందువల్ల కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గింది అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివిటీ తగ్గకపోవడంతో జిల్లాలో మరికొన్ని రోజుల పాటు కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. కావున ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇంట్లో నుంచి అవసరం అయితేనే బయటికి రావాలని, వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa