పదవులను చేపట్టిన వారు బాధ్యతగా పనిచేసి ప్రజలకు చేరువ కావాలని నూతనంగా ఎన్నికైన రెండవ వైస్ ఎంపీపీ లకు నియోజకవర్గ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వ్యాప్తంగా మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవులకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఉరవకొండ, విడపనకల్లులో జరిగిన కార్యక్రమాల్లో విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికైన వైస్ ఎంపీపీ లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం.. పార్టీ అభివృద్ధి కోసం తాపత్రయపడి పని చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి కచ్చితంగా చేరేలా చూడాలని సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు పలానా సంక్షేమ పథకం రాలేదనే మాట రాకుండా చూసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, జెడ్పిటిసి లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa