ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికీ వైఎస్సార్ కానుక పెన్షన్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 05:54 PM

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట  నియోజకవర్గ స్థాయిలో అర్హులైన పేదలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని 26,873   మందికి వైఎస్సార్ కానుక సామాజిక భద్రత పెన్షన్ల్ కోసం పంపిణి చేస్తున్నామన్నారు.  స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం విమలాపురం గ్రామ లబ్దిదారులకి జనవరి  పెన్షన్లు మంత్రి అందచేశారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు  మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ సామాజిక భద్రత పెన్షన్స్ కింద 4,97,279 మందికి రూ.126.21 కోట్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో కొత్తగా జనవరి నెలలో మరో 13,722 మందికి రూ.3.21 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం  చేకూర్చడం జరుగుతున్న దని తెలిపారు. 2022 జనవరి నెలలో అందచేసే పెన్షన్. మొత్తాన్ని రూ.2250 నుంచి రూ.2500 కి పెంచడం జరిగిందన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని 26061 మందికి రూ.648.39 లక్షలు లబ్దిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతున్న దని తెలిపారు. నియోజకవర్గములో ని నాలుగు.  మండలాలకు చెందిన వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఆచంట లో 7777మంది కి రూ.194.21 లక్షలు, పెనుగొండ లో 8389 మందికి రూ.207.79 లక్షలు , పెనుమంట్ర లో 7899  మందికి రూ.195.91 లక్షలు, పోడూరు లో 1996 మందికి రూ.50.49 లక్షలను పంపిణీ చేస్తున్నా మన్నారు. ఆచంట  నియోజకవర్గంలో జనవరి నుంచి మరో 812  మంది కొత్త గా పెన్షన్లు మంజురూ చేసి అందిస్తున్నామని వనిత తెలిపారు.  అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం లో చిత్తశుద్దితో పనిచ్చేయ్యాడమే లక్ష్యం గా అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa