ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కట్టడికి వ్యాక్సినే మంత్రం: ఎమ్మెల్యే శ్రీదేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 09:10 AM

ఒమిక్రాన్ వైరస్ ను అడ్డుకోవాలంటే అది కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మూడో దశ పట్ల ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సిద్ధంగా ఉండాలి. ఓమిక్రాన్ వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.


కరోనా రెండుదశాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చేసిన కృషి వల్లే కరోనా మొదటి దశ, రెండో దశ కట్టడి అయిందన్నారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారికి వ్యాక్సిన్ సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 18 ఏళ్ల పైబడిన వారికి 90 శాతం పూర్తి అయింది అంటే. అది ఏఎన్ఎం, ఆశా వర్కర్ల వల్లే సాధ్యమైందన్నారు. కాలేజీలో, స్కూల్లలో విద్యార్థుల సమూహం ఎక్కువగా ఉంటుందని. అలాంటి సమయంలో విద్యార్థులకు వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేసారు.


సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీ. హెచ్. సీ వైద్యఅధికారి తిరుమల, వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పప్పుల సీతారామిరెడ్డి, వైసీపీ నాయకులు కొప్పు వెంకట్, నూకతోటి వెంకటేశ్వర్లు, చీకటి దేవదాసు, అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి, యేరువా దేవేందర్ రెడ్డి, భీమవరపు బ్రహ్మారెడ్డి, ఆళ్ల హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa