ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్డ్ హౌస్ మానిటరింగ్ పై అవగాహన కలిగి ఉండాలి: డిఎస్పి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 09:14 AM

గుంటూరు: లాక్డ్ హౌస్ మానిటరింగ్ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డిఎస్పి సి హెచ్ విజయ భాస్కర్ రావు అన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌస్ మోనిటరింగ్ లో నమోదు చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు. తాళాలు వేసి ఊరు వెళ్లేవారు విలువైన వస్తువులు నగదు, బంగారం ఇళ్లలో ఉంచరాదని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ లు అశోక్ కుమార్, వెంకట్రావు, భక్తవత్సల రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa