ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘట్టమనేని రమేష్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 11:55 AM

ఘట్టమనేని రమేష్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు మరియు  మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘రమేష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సీనియర్ నటుడు కృష్ణ గారి కుమారుడు రమేష్ బాబు నటుడిగా మరియు నిర్మాతగా పనిచేశాడు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa