ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గుంటూరు నగరంలో ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 11, 2022, 12:55 PM

గుంటూరు నగరంలో సీఎం పర్యటిస్తున్న కారణంగా గుంటూరు అర్బన్ ఆరిప్ హాపిజ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పీ గుంటూరులో ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం10గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ కు చేరుకుని అక్కడనుంచి రోడ్డుమార్గాన విద్యానగర్ వెళ్లనున్న నేపథ్యంలో, బుధవారం ఉదయం 10. 00 గంటల నుండి మద్యాహ్నం 12. 30 గంటల వరకు నగరంపాలెం జిల్లా కోర్టు నుంచి జంక్షన్ నుండి పట్టాభిపురం. స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల, రింగ్ రోడ్డులోని విద్యా నగర్ 3 న లైన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రజలు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ డిఎస్పీ రమణకుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa