ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 04:17 PM

విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుని కిరాతకానికి ఆత్మహత్య చేసుకొన్న 14 ఏళ్ల బాలిక ఆత్మ శాంతికై గూడూరు పట్టణంలోఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ పట్టణాధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు మాట్లాడుతూ
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదన్నారు.
విజయవాడలో చిన్నారి మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల నాయకులు అమన్, తూపిలి లక్ష్మీ, నెల్లటూరు భవాని పలువురు మహిళలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa