అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఆదివారం విజయవాడకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఆంధ్ర రత్న భవన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించే సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి (అడ్మిన్) రవికాంత్ నూతలపాటి ప్రకటనలో వెల్లడించారు. మీనాక్షి నటరాజన్ తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నిక అధికారులు స్పెన్సర్ లాల్, హసీనా సయ్యద్ ఈ సమావేశానికి హారవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్సులు సి.డి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ముఖ్య కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa