ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ, దానికి సంబంధించిన పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు..
- గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు
హెచ్ఆర్ఏ శ్లాబులు:
- 50 వేలలోపు జనాభా ఉంటే 10 శాతం, రూ.11 వేలు సీలింగ్
- 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే 12 శాతం, రూ.13 వేలు సీలింగ్
- 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు)
- 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్
- సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్ఆర్ఏ (2022 జూలై నుంచి 2024 జూన్ వరకు)
రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్..
- 70-74 ఏళ్ల వయసు వారికి 7 శాతం
- 75- 79 ఏళ్ల వయసు వారికి 12 శాతం
- గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు
- 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు.
- వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు.
- ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు
- పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు
- మారిన హెచ్ఆర్ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు.
- ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల.
- సీపీఎస్ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్ మ్యాప్ రూపకల్పన
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన
- మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల
- ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు
- పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa