విశాఖపట్నం: గిరిజన మహిళను కాన్పు కోసం అరబిందో ఎమర్జెన్సీ 108 అంబులెన్స్ వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో వాహనంలొనే ప్రసవించిన సంఘటన చింతపల్లి మండలం బురుగుబయలు గ్రామం కోరుకొండ అవతల నందు జరిగింది. చింతపల్లి మoడలం బురుగుబయలు గ్రామానికి చెందిన అణుగురు పావని(21) ఆదివారం సాయంత్రం పురుటినొప్పులు వచ్చాయీ. దీంతో 108 కు సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది గ్రామానికి చేరుకొన్నారు. ఆమెను కాన్పు కోసం లోతుగెడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావటంతో అంబులెన్సు సిబ్బంది వాహనం పక్కకు అపి ఈ ఎం టీ రాజు సుఖప్రసవం చేశారు.
వాహనంలోనె పావని ఆడబిడ్డ కు జన్మనిచ్చింది. అనంతరం తల్లిబిడ్డను లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లిబిడ్డ ఆరోగ్యముగా ఉన్నారు అని 108 సిబ్బందీ ఈఎంటి రాజు, పైలట్ రహిమాన్ తెలిపారు. అనంతరం తల్లిబిడ్డలను సురక్షితంగా ఆసుపత్రి కి చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa