ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 11:22 AM

రాజ్యాంగంపై దాడిచేసేవారు ఎంతటివారైనా సరే అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపట్ల దళిత సంఘాలు హిందూపురంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి కర్మకాండలు చేశారు.


ఈ సందర్భంగా ఎం ఆర్ పి ఎస్ తాలూకా అధ్యక్షులు కౌన్సిలర్ సతీష్ కుమార్, దళిత సంఘాల నాయకులు మోదాశివ, జయసింహాలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలపట్ల దేశ ద్రోహం కేసు నమోదుచేసి వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని నీరు గార్చి మన దేశచట్టాలపై ఆరోపించడం తగదన్నారు. రాజ్యాంగంపై అనుమానించడమంటే అంబేద్కర్ను అవమానించడమేనన్నారు. దళితుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయమనడం హేయమైన చర్య అన్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని వెంటనే బర్తరఫ్చసి అరెస్ట్చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, నవీన్, అనీల్, ఉమర్ఫారూక్, ముస్తఫ, జయక సీమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa