భర్తపై కోపంతో ఆ మహిళ దారుణానికి ఒడిగట్టింది. వేధింపులకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అతడిని పిచ్చోడిగా మార్చేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏడేళ్లుగా భర్త తినే ఆహారంలో, తాగే నీళ్లలో మందులు కలిపేసింది. చివరికి భర్తకు అనుమానం రావడంతో ఆ కిరాతకం అంతా ఇటీవల బట్టబయలైంది. పోలీసులు వెల్లడించిన ఈ సంచలన కేసు వివరాలిలా ఉన్నాయి.
కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన సతీష్ శంకర్, ఆశ సురేష్కు 2006లో వివాహమైంది. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఐస్క్రీమ్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసి, సతీష్ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆయనకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిస్సత్తువతో ఏ పనీ చేయలేని స్థితికి వెళ్లేవాడు. అయితే తాను ఇంటిభోజనం కాకుండా బయట తింటే ఆరోగ్యం బాగుండడం గమనించాడు. దీంతో ఆయనకు తనపై భార్య ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందనే అనుమానం తలెత్తింది. అనుకున్నదే తడవుగా భార్య స్నేహితురాలిని ఈ విషయం తెలుసుకోమని పురమాయించాడు.
దీంతో స్నేహితురాలికి ఆమె అన్ని విషయాలనూ వెల్లడించింది. భర్త తినే ఆహారంలో, తాగే నీళ్లలో ఓసీడీ ఉన్న వారి కోసం ఉపయోగించే సైకోట్రోపిక్ డ్రగ్స్ను కలిపి ఇస్తున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు ఫోన్ కాల్ రికార్డుతో సహా బాధితునికి ఇచ్చింది. తన అనుమానం నిజమవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. తన తండ్రికి తల్లి కూడా అలాగే చేసిందని తేలింది. కేసు తీవ్రతపై పాలక్కడ్ ఎస్పీ షజు జోస్ స్పందించారు. ఆ డ్రగ్స్ దీర్ఘకాలం వాడితే మతిస్థిమితం పోతుందని, కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉందని వెల్లడించారు. నిందితురాలితో పాటు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa