ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 9న తిరుమలకు వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:55 PM

శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 9 వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలకు రానున్నారు. 9 వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. సాయంత్రం తిరుమలకు పద్మావతి అతిథి గృహంలో రాత్రి వెంకయ్యనాయుడు బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 10 వ తేదిన శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు దర్శించుకోనున్నారు. దర్శనంతరం మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెంకయ్య నాయుడు తిరిగి వెళ్ళనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa