ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్ లో కుప్పకూలిన వైసిపి ఎంపీ..ఆస్పత్రికి తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:22 PM

వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో హుటాహుటిన ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆయన సిబ్బంది ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలోని ఆర్ ఎంఎల్ఏ అనే ప్రైవేట్ ఆస్పత్రికి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆయన సిబ్బంది తరలించినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం పూట పార్లమెంటు ఆవరణలో పిల్లి సుభాష్ చంద్రబోస్ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారు. ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి వైద్యులు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa