దొంగ బంగారం కేసులో మడకశిర పోలీసులు వేధిస్తున్నారంటూ త్యాగరాజనగర్కు చెందిన ఒకే కుటుoబంలో నలుగురు మహిళలు మంజుళ, శారదమ్మ, గంగమ్మ, దీపలు మాత్రలు మింగి ఆత్మహత్యయత్నంకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. అయితే వెంటనే గమనించిన స్థానికులు హిందూపురం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పరీక్షించిన వైద్యులు వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితుల్లో మంజుళ అనే మహిళ మాట్లాడుతూ తన భర్త రామాంజినేయులు మడకశిర ప్రాతంలో దొంగతనం చేశారని ఆ బంగారం తమకు ఇచ్చారంటూ మడకశిర సీఐ శ్రీరాములు తమను వేదింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బంగారం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టకపోతే పరిణామం తీవ్రంగా ఉంటాయని సీఐ బెదిరిస్తున్నాడన్నారు. అయితే ఇలియాజ్ అదేపనిగా ఉద్దేశ్యపూర్వకంగా తన భర్తపై చేయని నేరాలు మోపుతున్నాడన్నారు. గతంలో కూడా బెంగళూరు పోలీసులకు తప్పుడు. సమాచారం ఇవ్వడంతో వారు హిందూపురానికి వచ్చి వేధించడంతో తమ బిడ్డల సొమ్ముకూడా వారే తీసుకుపోయారు. కానీ మరోసారి మడకశిర పోలీసులు వచ్చి తమను వేదింపులకు గురిచేయడంతో ఆత్మహత్యలే శరణ్యమన్నారు. దీంతో సోమవారం మధ్యాహ్నం త్యాగరాజ్ నగర్ లోని ఇంటిలో తమతోపాటు శారదమ్మ, గంగమ్మ, దీపలు మాత్రలు మింగామన్నారు. పోలీసుల నుండి తమకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై మడకశిర సీఐ శ్రీరాము వివరణ కోరగా మడకశిర, హిందూపురం ప్రాంతంలో ఇళ్లలో చోరీలు జరిగాయి. దీంతో రాబడిన సమాచారంతో మూడు రోజుల క్రితం అనంతపురం సబ్ జైలులో ఉన్న రామాంజిని తీసుకొచ్చి విచారించాం. ఆయన తెలిపిన మేరకు త్యాగరాజనగర్లో ఉన్న వారి కుటుంబ సభ్యులను విచారించాం. కానీ వారిపై ఒత్తిడి తేలేదు. అయితే వారు తప్పించుకోవడానికి ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa