ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డతో సహా మహిళా ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 12:04 PM

అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండల పరిధిలోని చౌడేశ్వరి ఆలయం సమీపంలో ఎన్టీఆర్ పైలాన్ దగ్గర సోమవారం మధ్యాహ్నం సమయంలో బుక్కపట్నం కు చెందిన శెట్టిపల్లి ప్రవీణ్ కుమార్ భార్య శెట్టిపల్లి చంద్రకళ (29) ఇద్దరు ఆడపిల్లలు ను ప్రవళిక (5) హాసిని (2) ఇద్దరు పిల్లల లు బుక్కపట్ననికి చెందిన అక్షర స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ సమయంలోనే ఇద్దరు పిల్లలను తన వెంట బెట్టుకొని వచ్చి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.


అక్కడే దగ్గర లో ఉన్న వ్యక్తులకు పిల్లల అరుపులు వినిపించడంతో హుటాహుటిన అక్కడ వెళ్లి (రైతు నాగరాజు , కొత్తచెరువు వార్త విలేఖరి) వారిని కాపాడారు. ఆత్మహత్యకు కారణాలు అడుగగా ఈమె కు కుటుంబంలో ఎలాంటి కలహాలు గానీ సమస్యలు గానీ లేవు కానీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళ ప్రతిరోజు తన ను వేధిస్తోందని ఆమె వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నారని ఆమె తెలిపారు.


పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై నర్సింహులు ఘటనా స్థలానికి వెళ్లి వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడిన నాగరాజును, వార్త విలేకరిని అభినందించారు. చంద్రకళ ను వేధిస్తున్న మహిళను స్టేషన్ కి పిలిపించి తగిన విధంగా కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa