ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి చేతిలో ప్రియురాలు హతం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 12:41 PM

ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఖండ్వాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఖండ్వా జిల్లా పంధానా ప్రాంతానికి చెందిన రజని(27) ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లో క్లాస్ 3 స్థాయి అసిస్టెంట్ క్లర్క్‌గా పనిచేస్తోంది. ఖండ్వాలో ఉద్యోగ రీత్యా ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. రజనీకి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పింది. 3 రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 5న అద్దెకు ఉంటున్న గదిలో రజనీ హత్యకు గురైంది. రజనీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు గదికి వెళ్లి చూడగా కూతురు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు స్పాట్‌కు చేరుకుని రజనీ ఆచూకీ కోసం వెతకగా ఆమె మృతదేహం వాటర్ ట్యాంక్‌లో లభ్యమైంది. ఆమెను కొట్టి చంపినట్లు గాయాల ద్వారా తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. రజని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటంతో వారి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ గొడవలో రజనీ ప్రియుడు ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడని, ఆ తర్వాత ఎవరూ చూడకుండా ఆమె మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసి పారిపోయాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa