ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రచందనం రవాణాపై ప్రత్యేక నిఘా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 11:25 AM

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా అటవీ శాఖాధికారి వైవీ షణ్ముఖకుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయగిరి అటవీ శాఖా కార్యాలయంలో రికార్డులు పరిశీలించి సిబ్బందితో సమీక్షించారు. తొలుత వరికుంట పాడు మండలం మహమ్మదాపురం గ్రామంలో టేకు చెట్ల నరికివేతకు ఓ రైతు దరఖాస్తు చేసుకోవడంతో పొలాన్ని పరిశీలించారు. అలాగే దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో ప్లాంటేష తోపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతోపాటు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు తమిళ కూలీల ప్రవేశంపై సమాచారం అందించేలా అవగాహన కల్పించాలన్నారు. పోలీసు, అటవీ శాఖ కలిసి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసులు, ఎస్ఎస్వీ మానం శ్రీనివాసులు, సిబ్బంది రాంబాబు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa