ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ టికెట్ ధర పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 10:55 AM

చిత్తూరు: శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ టికెట్ ధరను పెంచారు. టికెట్ ధర రూ.300 నుంచి రూ.500లకు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన టికెట్ ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ టికెట్లతో రోజు 2500 మంది భక్తులు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.750, రూ.1500, రూ.3000, రూ.5000 టికెట్ ధరలు యాధాతథంగా ఉంటాయని చెప్పారు.  పూజా కార్యక్రమంలో ఉంచే వెండి విగ్రహాలను హుండీలో వేయాలని తెలియక పోవడంతో కొందరు భక్తులు తమ వెంట తీసుకెళుతున్నారని, దీనివల్ల ఆలయంలో వెండి తరిగిపోయిందని, ఆ నష్టాన్ని పూడ్చడానికే టికెట్ ధర పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగానే టికెట్ ధర పెంచాల్సి వచ్చిందని తెలిపారు. లడ్డూ ప్రసాదం ధరను కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa