ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌ వివాదంపై స్పందించిన యూపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 05:03 PM

లఖ్‌నవూ: రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో ప్రముఖ కట్టడం తాజ్‌మహల్‌ లేకపోవడంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. రూ.156కోట్లతో తాజ్‌మహల్‌, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు యూపీ పర్యాటక శాఖ ప్రతిపాదన తీసుకొచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రపంచబ్యాంకు సహకారంతో ఈ పనులు ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని తెలిపింది.


దీనిపై యూపీ మంత్రి ఆర్‌బీ జోషి మాట్లాడారు. ‘తాజ్‌మహల్‌ ప్రపంచ వారసత్వ కట్టడం, పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే స్థలం. అక్కడ మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.’ అని ఆమె తెలిపారు. ఇటీవల యూపీ రాష్ట్ర పర్యాటక శాఖ సందర్శనీయ ప్రదేశాలతో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కానీ అందులో తాజ్‌మహల్‌ ప్రస్తావన లేకపోవడం వివాదానికి దారి తీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa