ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈరోజు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించిన మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్-2022లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖపట్నంను జాతికి అంకితం చేశారు. నేవల్ డాక్యార్డ్లోని ఐఎన్ఎస్ వెలా సబ్మెరైన్ను కూడా ఆయన సందర్శించారు. తన పర్యటనలో భాగంగా మిలన్ పరేడ్ను ప్రారంభించారు.పరేడ్ సందర్భంగా తూర్పు నౌకాదళం సీఎం జగన్ కు గౌరవవందనం సమర్పించింది.దీంతోపాటు ఐఎన్ ఎస్ వేలా సబ్ మెరైన్ లోకి ప్రవేశించి అందులోని వ్యవస్థలను ఆసక్తిగా పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa