సీఎస్కే మాజీ ఆటగాడు సురేష్ రైనాకు ఇటీవల జరిగిన 2022 మెగా వేలంలో కోలుకోలేని షాక్ తగిలింది. రూ.2 కోట్ల బేస్ ధరతో ఉన్న ఆయనను కొనేందుకు ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో విదేశీ లీగ్లలో ఆడతానని ఆయన పెట్టుకున్న దరఖాస్తును బీసీసీఐ ఆమోదించలేదు. అయితే తాజాగా 2022 ఐపీఎల్లో రైనా ఆడేందుకు మార్గం సుగమం అయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.2 కోట్ల బేస్ ధరతో జేసన్ రాయ్ను కొనుగోలు చేసింది. అయితే సుదీర్ఘ కాలం బయో బబుల్లో ఉండడం తన వల్ల కాదంటూ ఆయన ఈ సీజన్కు స్వయంగా దూరమయ్యాడు. ఇక జేసన్ రాయ్ స్థానంలో సురేష్ రైనాను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తున్నారు. అనుభజ్ఞుడైన రైనాను తీసుకుంటే గుజరాత్ జట్టుకు తిరుగుండదని సలహాలు ఇచ్చారు. దీనికి తాజాగా ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వస్తోంది. దీంతో మిస్టర్ ఐపీఎల్ రైనా 2022లో గుజరాత్ జట్టు నుంచి బరిలోకి దిగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa