ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అమరావతిలో సచివాలయం నిర్మాణం, సిబ్బంది గృహాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు, ఉద్యోగుల ఇళ్లకు రూ.1,126 కోట్లు సమకూరింది. దీనిపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ బడ్జెట్ లో కేంద్రం నిధులు ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన పట్టుదల విడనాడి రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa