దివంగత మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎపుడూ జోక్యం చేసుకోలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో సీఎం వైఎస్ జగన్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సవాంగ్ స్పందించారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నట్టు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, పైపెచ్చు కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలనే తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. వివేకానందరెడ్డి, అవినాశ్రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు లాంటివని మాత్రమే జగన్ చెప్పారని అన్నారు. సెప్టెంబరు 2019లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డి తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి చెప్పానని అన్నారు. తాను డీజీపీగా ఉండగా అవినాశ్రెడ్డి కానీ, ఈసీ సురేంద్రనాథ్రెడ్డి కానీ, డి.శివశంకర్రెడ్డి కానీ ఏనాడు తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa