ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా మధ్యవర్తిత్వ వాదనలను ఖండించిన భారత్

international |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 10:16 AM

2025 మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలను (ఆపరేషన్ సిందూర్) తామే సద్దుమణిగించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వాంగ్ యీ మాట్లాడుతూ, మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ముగిశాయని, మే 10న జరిగిన ఫోన్ కాల్ ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa