ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ ఛార్జీలు!

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 12:08 PM

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాహనదారులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మరో షాక్‌ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి హైవేల ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఇటీవల హైవేలపై 60 కి.మీ. దూరంలో ఒక్కటే టోల్ గేట్ ఉంటుందని కేంద్ర మంత్రి గడ్కరీ శుభవార్త చెప్పారు. అంతలోనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను పెంచనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. సుమారు 65 శాతం వరకు టోల్ చార్జీలు పెరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. హైవేలపై తిరిగే వాహనాల టోల్ ఛార్జీలను సవరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాణిజ్య వాహనాలు టోల్ ట్యాక్స్‌ను అదనంగా రూ.65 మేర చెల్లించాల్సి ఉంది. ప్రైవేట్ వాహనాలు వన్-వే నిమిత్తం అదనంగా రూ.10 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలన్నీ మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రచారం సాగుతోంది.


కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10కి పెంపు.
బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కు పెంపు.
భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50కి పెంపు.
సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa