ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు ఆత్మహత్యలను అరికట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 12:41 PM

తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పాలతోడు గ్రామంలో ఆర్ధిక ఇబ్బందులు, సాగు నష్టాలతో ఇటీవల కాలంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఈ విషయం బయటికి రాకుండా ప్రభుత్వం తొక్కిపడుతుంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన శ్రీ పిల్లా రామకృష్ణ అనే కౌలు రైతు కుటుంబాన్ని, మరియు పట్టపగలు సురేష్ కుటుంబాన్ని ఆయన   పరామర్శించారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలైన వీరిని ప్రభుత్వం ఆదుకొవాలని డిమాండ్ చేసారు. పేదల పక్షాన పోరాటం చెయ్యడానికి జనసేన ఎప్పుడు ముందంజలోనే ఉంటుందని భరోసా కల్పించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa