చట్టసభలు, న్యాయ వ్యవస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వీలైనంత త్వరగా బీసీ జనగణన చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రిని మోడీని కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేసిన అనంతరం ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదే విధంగా జ్యూడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. అంత కంటే ముందే బీసీ జనగణన చేయాలని కూడా కోరామని చెప్పారు. బీసీ జనగణన జరగకపోతే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదు కాబట్టి.. జనాభా లెక్కలు తేలకుండా, రిజర్వేషన్లు కల్పించాలంటే సాధ్యం కాదు కాబట్టి, బీసీ జనగణన జరపాలని విజ్ఞప్తి చేశామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa