ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ లో నేటి మ్యాచ్

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 01:33 PM

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఈ రోజు ముంబైలోని బ్రాబౌర్నే మైదానంలో ఏడవ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో రెండవ మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఆడిన తొలి మ్యాచ్ లలో ఈ ఇరు జట్లకు ఓటమే ఎదురవడంతో ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో  విజయం సాధించాలని కసిగా ఉన్నాయి. కెప్టెన్సీ విషయంలో అనుభవం లేని రవీంద్ర జడేజ, లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ లలో విజయం సాధించేదెవరిని ఆసక్తిగా ఎదురుసూస్తున్నారు క్రికెట్ అభిమానులు. లీగ్ పేలవమైన ప్రారంభం తర్వాత, ఇప్పుడు రెండు జట్లూ ఎలాగైనా గెలవాలని తమ ప్లేయింగ్ XIలో మార్పులు చేసే అవకాశం ఉంది.లక్నో బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పులుండకపోవచ్చు. అయితే, జట్టు బౌలింగ్‌లో తక్షణ మెరుగుదల అవసరం. దీని కోసం వారు ప్లేయింగ్ XIలో మార్పులు చేయవచ్చు. స్టార్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ తిరిగి చెన్నై జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, జట్టు బౌలింగ్ ఎటాక్‌లో మార్పు కనిపించడం లేదు.చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఎక్కువ అనుభవం ఉంది. ఈ విషయం వారికి అనుకూలంగా ఉంటుంది. బౌలర్లపైనే ఆధారపడి ఉంది లక్నో విజయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa