ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో మరోసారి లాక్ డౌన్...రోబోలతో ప్రచారం ఇలా చేశారు

international |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 10:45 PM

మనిషి బయటకు రాకుండా చేయడం, అది కూడా మనిషి రాకుండానే  ప్రజలకు అవగాహన కల్పించాలంటే అది మాత్రం ఓ సవాలే. కానీ చైనా వినూత్నంగా ఆలోచించింది. ఇదిలావుంటే చైనాలో కొన్నివారాలుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దాంతో దేశంలోని అనేక నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. షాంఘై మహానగరంలోనూ కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో కొన్నిరోజుల కిందట లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో, షాంఘై వీధుల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దంటూ ఒక రోబో హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు సాగింది. చైనా భాషలో ఉన్న ఆ ఆరోగ్య ప్రకటనలు రోబో వీపుపై ఉన్న స్పీకర్ లోంచి వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa