ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తినేందుకు ఏమీ లేక...ఉక్రెయిన్ లో రష్యా సైనికుల దుస్థితి

international |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 01:55 AM

ఉక్రెయిన్ లో అసలు ఏం జరుగుతోంది. రష్యా పై చెయ్యి సాధించిందా...? మీడియా సరిగా కవర్ చెయ్యలేకపోతోంది గానీ.. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనే వార్తలొస్తున్నాయి. జస్ట్ వారంలోపే వార్ ముగించేయాలనుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ఎవరి మాటా వినకుండా ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగారు. భారీగా సైన్యం, యుద్ధ ట్యాంకులు, విమానాలను రంగంలోకి దింపారు. కానీ ఆయన ఊహించనిది ఉక్రెయిన్‌లో జరిగింది. ప్రపంచ దేశాల ఆర్థిక సాయంతో భారీగా ఆయుధాల్ని పొందుతున్న ఆ దేశ సైన్యం... రష్యా సైన్యాన్ని బలంగా దెబ్బకొడుతోంది. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టి పొరపాటు చేశామా అని రష్యా సైన్యం అనుకునే పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది. ఇవాళ్టికి 37వ రోజు. రష్యా అధ్యక్షుడు అంచనాలు అన్నీ తప్పాయి. ఏ ఒక్కటీ కరెక్ట్ అవ్వలేదు. రష్యా ఆయుధాలు భారీగా అయిపోయాయి. సైన్యం మరణాలు విపరీతంగా పెరిగాయి. అటు ఉక్రెయిన్ శ్మశాన దిబ్బలా మారింది. రాజధాని కీవ్ సహా చాలా నగరాలు నేలమట్టం అయ్యాయి. ఎక్కడ చూసినా రెండు దేశాల సైన్యం శవాలే కనిపిస్తున్నాయి. వాటిని అక్కడి నుంచి తరలించే పరిస్థితి లేదు. యుద్ధంలో తినేందుకు తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో... రష్యా సైనికులు అక్కడి కుక్కల్ని చంపి తింటున్నారని తెలిసింది. ఐతే... ఆ కుక్కలు... ఆల్రెడీ చనిపోయిన సైనికుల్ని పీక్కు తింటున్నాయి. అలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితులను చూస్తున్నారు రష్యా సైనికులు. అమెరికా అధికారుల అంచనాల ప్రకారం... మంగళవారం నాటికి రష్యా సైనికులు 10వేల మందికి పైగానే చనిపోయారు. రష్యా సైనికులు మాట్లాడుకున్న ఓ ఆడియో సోషల్ మీడియాకి ఎక్కింది. అందులో ఓ సైనికుడు... "నువ్వు కనీసం ఏదైనా తిన్నావా" అని అడిగితే మరో సైనికుడు... "ఆ తిన్నాను. మరీ అంత చెత్తగా లేదు. మేము నిన్న మాంసం తిన్నాం" అని చెప్పాడు. "నువ్వు తిన్నది కుక్క మాంసమా లేక ఇంకేదైనానా?" అని అడిగితే... "అదే తిన్నాం. మాంసం తినాలనుకున్నాం" అని చెప్పాడు. "మీరు తినడానికి ఏమీ మిగల్లేదా?" అని అడిగితే... "రెడీ టూ ఈట్ మీల్స్ తెచ్చుకున్నాం. కానీ దాన్ని తినలేకపోతున్నాం" అని ఆ సైనికుడు తెలిపాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్యా శాంతి చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం వల్ల ఏమీ సాధించలేకపోయిన పుతిన్ కాస్త వెనక్కి తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ పుతిన్‌ని నమ్మే పరిస్థితి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నాడు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ సహా నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇవి సామాన్యులకు మరింత భారం అవుతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. మొన్నటిదాకా కరోనా సమస్యతో పోరాడిన ప్రపంచ దేశాల ప్రజలకు ఇప్పుడు ఇది పెనుముప్పుగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa