ఐపీఎల్ 2022లో ఈరోజు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సన్రైజర్స్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ దీపక్ హుడా అర్ధ సెంచరీలతో రాణించారు.ఓపెనర్గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 68 పరుగులు చేయగా, దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఆయుష్ బడోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసాడు. దీంతో సన్ రైజర్స్ ముందు టార్గెట్ 170 పరుగులు నిలిచింది.
అనంతరం సన్ రైజర్స్ లక్ష్య ఛేదనలో మోస్తారు 7 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ విలియమ్సన్, ఐడెన్ మార్క్రమ్ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. విలియమ్సన్ 16 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు. దీనితో సన్ రైజర్స్ జట్టు ఓటమి పాలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa