ప్రజా సంక్షేమం తో పాటు రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేస్తున్నారని వైఎ స్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదల , రామచంద్రనగర్ , కరెన్సీనగర్ తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పను లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేం దుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అన్నివర్గాల ప్రజలు లబ్ది పొందుతున్నారని చెప్పారు. ప్రజా సం క్షేమంతో పాటు మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రోడ్లు విద్యుత్ , తాగునీరు , యూజీడీ వ్యవస్థలను అభివృ ద్ధి చేసేందకు అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తూర్పు నియోజ కవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగ రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని డివిజన్లలో మౌలిక వసతులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa