ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని కాంట్ కొత్వాలి ప్రాంతంలోని ముంతాజ్ నగర్ సమీపంలో మంగళవారం బస్సు బోల్తా పడడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.నివేదికల ప్రకారం, బస్సు డ్రైవర్ మరొక వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి, అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది.ఢిల్లీ నుంచి వస్తున్న బస్సు సిద్ధార్థ్నగర్కు వెళ్తోంది. గాయపడిన ప్రయాణికులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa