జగన్ చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతి వల్ల ..ఆయన పార్టీ నేతలూ బలవుతున్నారు అని టీడీపీ నాయకులూ ఆరోపించారు. అలానే ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకి చెల్లించకపోవడంతో ఎవరూ కనీసం గుంతలో తట్టెడు మట్టి కప్పడానికి ముందుకు రావడంలేదు. అలా పడిన గుంతే వైసీపీకి చెందిన కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్నలక్ష్మి ప్రాణం తీసింది. కొనప్రాణంతోనైనా ప్రసన్నలక్ష్మి బతికేదేమో! ఈ సారి జగన్రెడ్డి అవినీతి దాహం-బంధుప్రీతి మృత్యువులా వచ్చాయి. అంబులెన్సుల్లో వందలకోట్లు దోచేందుకు విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా ఇచ్చేశాడు జగన్రెడ్డి. ప్రమాదం జరిగిందని అంబులెన్స్కి ఫోన్ చేస్తే సాయిరెడ్డి అల్లుడి అంబులెన్స్ రాలేదు. దీంతో ప్రసన్నలక్ష్మి ప్రాణాలు విడిచింది. ఇది రోడ్డుప్రమాదంలో మృతి కాదు..జగన్రెడ్డి సర్కారు చేసిన దారుణహత్య అని వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa