ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ కెప్టెన్ కు జరిమానా

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 01:09 PM

ఐపీఎల్ 2022 సీజన్లో గురువారం ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. 


ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్లో ఓవర్‌ రేటు కారణంగా ఐపీఎల్ సంస్థ ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే మొదటి స్లో ఓవర్ రేట్. పోతే..  అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ లు కూడా ఆయా జట్ల  స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్‌ 2022లో ఇప్పటివరకు ఫైన్‌ విధించిన కెప్టెన్లలో రిషబ్ పంత్ మూడో కెప్టెన్‌గా ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa