ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్నం ఇచ్చుకోలేక యువతి బలవన్మరణo

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 06:04 PM

వరకట్నాన్ని నిషేధించినా, అడిగినంత ఇస్తేనే పెళ్లి జరుగుతుందని భీష్మించే వారు తరచూ కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పు చేసైనా కొందరు ముట్టజెప్పుతున్నారు. మరికొందరు ఇవ్వలేక మెట్టినింటి వారితో మాటలు పడుతున్నారు. అయితే ఓ యువతిని ప్రేమించిన యువకుడు, కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో వారు చెప్పిన మొత్తం ఇవ్వలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో శ్రావణ సంధ్య లా చదువుకుంటోంది. ఈ క్రమంలో తోటి విద్యార్థిని ప్రేమించింది. ఇరువురి ప్రేమకు రెండు వైపులా కుటుంబ పెద్దలు పచ్చ జెండా ఊపారు. త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి గురించి సంప్రదింపులు జరుగుతున్న క్రమంలో అబ్బాయి తరుపు వారు ట్విస్ట్ ఇచ్చారు. రూ.15 లక్షలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తల్లిదండ్రులు అంత మొత్తం కట్నంగా ఇవ్వలేరని శ్రావణ సంధ్య భావించింది. ప్రియుడితో తన పెళ్లి జరగదని కుమిలిపోయింది. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa