ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నేడు కరోనా కేసులు ఎన్నంటే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 06:35 PM

ఏపీలో కరోనా వ్యాప్తి చాల వరకు తగ్గింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 63 మాత్రమే. గత కొన్ని రోజులుగా 10 కంటే తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,686 నమూనాలను పరీక్షించగా, 8 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  

మొత్తం 26 జిల్లాల్లో తాజా పరిస్థితిని నేటి బులెటిన్‌లో ప్రస్తావించారు. విశాఖపట్నం జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 14 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. ఆంద్రా రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,599 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,806 మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఏపీలో ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa