వేసవిలో ప్రజలు విపరీతమైన వేడి, వడదెబ్బకు గురవుతారు. ఈ క్రమంలోనే ప్రజలు కూలర్ల వస్తువులను ఎక్కువగా వాడేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నిమ్మరసం తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా.. పెట్రోల్, డీజిల్తో పాటు నిమ్మకాయ రేటు కూడా భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో నిమ్మకాయ ధర రూ. 350 పలుకుతుంది. నిమ్మరసం ఒక్కోటి రూ.10 వరకు విక్రయిస్తుండగా, ప్రజలు సైతం తాగేందుకు జంకుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa