ఐపీఎల్ 2022 సీజన్ ప్రేక్షకులకు నరాల తెగే ఉత్కంఠను పంచుతోంది. ఆఖరి బంతికి ఫలితాలు తారుమారు అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రెండు మ్యాచ్లు జరగనుండడంతో ప్రేక్షకులకు కనువిందు కానుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30కు కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక సాయంత్రం 7.30కు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ విషయానికొస్తే తాజా సీజన్లో కోల్కతా జట్టు నాలుగు మ్యాచ్లు ఆడితే మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.
కోల్కతాతో తలపడనున్న ఢిల్లీ జట్టు ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ, స్థాయికి తగ్గట్టు వారు ఆడితేనే కోల్కతాపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇక రెండో మ్యాచ్ విషయానికొస్తే లక్నో, రాజస్థాన్ జట్లు తమదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు కూడా సమతూకంగా ఉన్నాయి. భారీ హిట్టర్లు, మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల బౌలర్లు ఈ జట్లలో ఉన్నారు. దీంతో ఈ రెండు జట్లు కూడా పోటాపోటీగా ఆడే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఈ రెండు మ్యాచ్లు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa