పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సత్వర సేవలు అం దించేందుకే జిల్లాల విభజనతో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వం చేసిందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంఘీభావంగా బంటుమిల్లి మండలంలో ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు మండల పరిధిలోని మల్లేశ్వర్ గ్రామం నుండి బంటుమిల్లి మండల పరిషత్ కార్యాలయం వరకు సంఘీభావ, కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సమగ్ర అభివృద్ధి కోసం చిత్త శుద్ధితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రాడ్డికృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి చెప్పారు. అలాగే ర్యాలీలో భారీ ఎత్తున వైసిపి నాయకులు, డ్వా క్రా మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న స్వచ్చ సంకల్ప పథకంలో భాగంగా మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ నిమిత్తం రిక్షాలు పంపిణీ చేశారు. అలాగే మండలంలో పలువురికి మంజూరైన నూతన గృహప్రవేశం స్థలాలు మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలివెల చిన్న బాబు, మండల పార్టీ కన్వీనర్ మలిశెట్టి రాజబాబు, ఎంపీడీవోపి వెంకట లక్ష్మి, తాసిల్దార్ కలగర గోపాలకృష్ణ, యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు బాబురావు, సుజ్ఞానం మహేష్, వోడిమీ చిన్నారి బాబు, నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa