ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేకేఆర్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 54, నితీష్ రానా 30, రస్సెల్ 24 పరుగులతో రాణించారు. కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ 2, లలిత్ యాదవ్ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa